Ravi Shastri About Virat Kohli: విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్ తనను బాధించిందని, బీసీసీఐ-ఆటగాళ్ల మధ్య మరింత సమన్వయం అవసరమని మాజీ కోచ్ రవిశాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు. కోహ్లీ అనూహ్య నిర్ణయం అభిమానులను కూడా నిరాశపరిచిందని సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్తో మాట్లాడుతూ శాస్త్రి అన్నారు. ఈ మొత్తం పరిణామం బోర్డు, ఆటగాళ్ల మధ్య సరైన సమన్వయం లేకపోవడాన్ని సూచిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ విషయంలో నేను ఏదైనా చేయగలిగే స్థాయిలో ఉంటే, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ తర్వాత కోహ్లీని మళ్ళీ భారత టెస్టు కెప్టెన్గా నియమించేవాడిని” అని రవిశాస్త్రి అన్నారు. కోహ్లీ రిటైర్మెంట్ బాధాకరమని ఎమోషనల్ అయ్యారు. రవిశాస్త్రి కోచ్గా, విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు (2017-2021) టీమ్ ఇండియా అద్భుత విజయాలు సాధించింది. వీరిద్దరి నాయకత్వంలో 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్కు చేరుకోవడమే కాకుండా, ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు టెస్ట్ సిరీస్లు గెలిచి చరిత్ర సృష్టించారు.
రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత, విరాట్ కోహ్లీ వన్డే మరియు టెస్ట్ క్రికెట్లకు కూడా వీడ్కోలు పలికారు, 123 టెస్టుల్లో 9230 పరుగులు సాధించారు. 10,000 పరుగులకు చేరువలో ఆయన కెరీర్ ముగిసింది. ప్రస్తుతం, శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో భారత టెస్ట్ జట్టు జూన్ 20 నుండి ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది.