Flight Crash at Ahmedabad: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఘటనా స్థలిలోనే 241 మంది ప్యాసింజర్లు చనిపోయారు. ప్రమాద దశ్యాలు యావత్ ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తోంది. విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోవడంతో భారీ ప్రాణనష్టం జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణాలను అధికార వర్గాలు కూడా ఇంకా వెల్లడించలేదు. అయితే ఇక్కడే కొందరు విమానయాన నిపుణులు ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ వివరాలు ఈ కథనంలో..
సాధారణంగా విమాన ప్రమాదాలు కొన్నిసార్లు ఇంజిన్లోకి పక్షులు చేరడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని విమానయాన నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో విమానం టేకాఫ్ సమయంలోనూ పక్షులు ఢీకొనడం విమాన వేగం అందుకునే అవకాశాలు క్షీణిస్తాయని అన్నారు.
పక్షి ఢీకొనడం:
సింపుల్గా చెప్పాలంటే పక్షి ఢీకొనడం (Plane Bird Strike) అంటే విమానం టేకాఫ్ సమయంలో ఏవైనా పక్షులు ఎదురుగా వచ్చి విమానాన్ని ఢీకొట్టడమే. ఇలాంటి సంఘటనలు విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో చోటుచేసుకుంటాయి. ఇంజిన్లలోకి పక్షులు ప్రవేశించిన సందర్భాల్లో ఇంజిన్ లోపల ఫ్యాన్ బ్లేడ్స్ దెబ్బతింటాయి. తద్వారా ఇంజిన్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు ఇది ఇలాంటి అతి భారీ ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది.
ఇలాంటి సందర్భాల్లో ఎదురయ్యే పరిణామాలు..
పైన చెప్పిన విధంగా ఇంజిన్లోకి పక్షులు చొరబడితే.. ఇంజిన్ పనితీరు ఆగిపోయి ప్రమాదం జరుగుతుంది. దీంతో పాటు విమానం ముందు భాగంలో లేదా గ్లాస్ (విండ్షీల్డ్) పగలిన సందర్భాల్లో పైలట్కు గాయాలు అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. అలాగే విమానానికి సంబంధించి దారి (వే) కనిపించకపోవచ్చు. ఇక సైడ్లలోని రెక్కలు, ఇతర బాడీ పార్ట్స్ భాగాలు దెబ్బతింటే పీడనం ఎక్కువై విమానం కంట్రోల్ తప్పే అవకాశం ఉంటుంది.
ఆ చివరి క్షణాల్లో ఏం జరిగింది!
ఈ రోజు జరిగిన ఎయిర్ఇండియా విమాన ప్రమాదానికి ముందు పైలట్ మేడే (Mayday) కాల్ ఇచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత కంట్రోల్ రూమ్ విమానాన్ని సంప్రదించే క్రమంలో రెస్పాన్స్ రాలేదు. అంతలోనే ఘోర ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. అయితే టేకాఫ్కి ముందే అన్ని సరిచూసుకునే సిబ్బంది ఎక్కడ పొరపాటు చేసి ఉంటుదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కొందరు విమానయాన నిపుణులు మాత్రం ఇంజిన్లో పక్షుల ఏమైనా చేరి ఉంటాయా అని అనుమానిస్తున్నారు. ఎందుకంటే గతంలోనూ పక్షుల వల్ల ప్రమాదాలు జరిగి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అలాగే కొన్ని సమాయాల్లో ప్రమాదం నుంచి బయటపడ్డారు.