Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Nizamabad: నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని..

Nizamabad: నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని..

జనాభా పెరిగింది, కొత్త జీపీలు ఏర్పాటు చేయాల్సిందే

నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలను నూతన గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని ఆయన స్వగృహంలో కలిసి వివరించారు – టిఎస్ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్.

- Advertisement -

నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలలో గాంధీనగర్ మరియు ఇందిరానగర్, సంతోష్ నగర్, జింగ్యాల తాండ, మెట్టుమరి తాండ, నడిమితాండ, సాయి నగర్, చింతల్ తాండ, రామచంద్రాయన్పల్లి గ్రామాలలో జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని గ్రామాల అభివృద్ధి కోసం బాజిరెడ్డిప్రత్యేక చొరవ తీసుకొని గ్రామ పంచాయతీలకు అనుసంధానంగా ఉన్న గ్రామాలను ప్రత్యేక గ్రామాలుగా గుర్తించాలని తెలియజేశారు..

నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామాన్ని డిచ్పల్లి మండలంలో కలపాలని ఎర్రబెల్లి దయాకర్ రావుకి తెలియజేశారు. మల్లాపూర్ గ్రామస్తులకు డిష్పల్లి మండలంలో మార్కెట్, వివిధ పనులకు డిచ్పల్లి కేంద్రంగా నిర్వహిస్తారని, మల్లాపూర్ గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు డిచ్పల్లి మండలంలో మల్లాపూర్ గ్రామాన్ని కలపాలని ఎర్రబెల్లికి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News