Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్Bansuvada: నిప్పులుచెరిగిన స్పీకర్ పోచారం

Bansuvada: నిప్పులుచెరిగిన స్పీకర్ పోచారం

బాన్సువాడ పట్టణం లోని అంబెడ్కర్ చౌరస్తాలో జరిగిన భారత రాష్ట్ర సమితి “ఆత్మీయ సమ్మేళనంలో” పాల్గొన్నారు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి. DCCB చైర్మన్, BRS పార్టీ రాష్ట్ర నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమ్మేళనంలో బాన్సువాడ మున్సిపాలిటీ, బాన్సువాడ గ్రామీణ మండల BRS  పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమ్మేళనానికి కామారెడ్డి జిల్లా ఇంచార్జి, MLC దండే విఠల్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. 

- Advertisement -

ఈసందర్భంగా మాట్లాడిన పోచారం.. రేవంత్ రెడ్డి వంటి వాడు PCC అధ్యక్షుడుగా ఉండడం కాంగ్రెస్ పార్టీ దురదృష్టమన్నారు.  రేవంత్ రెడ్డి అక్రమంగా, దౌర్జన్యంగా పేదల భూములు ఆక్రమిస్తే, ఇక్కడి వారి నాయకుడు స్కూటర్లు, మోటార్ల దొంగ అంటూ మండిపడ్డారు.  ఆయన బడా చోర్ అయితే ఇక్కడి నాయకుడు చోటా చోర్ అంటూ మండిపడ్డారు.  ఇంకో బిజెపి నాయకుడేమో స్వంత అక్క భర్తను చంపిన A1 హంతకుడంటూ పోచారం మాట్లాడిన తీరు షాకింగ్ గా మారింది. ప్రతి గ్రామంలో 90 శాతం BRS పార్టీ కార్యకర్తలు ఉన్నారని,  అడ్డగోలుగా ఇలాగే మాట్లాడితే మా కార్యకర్తలు ఊరుకోరు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నా అంటూ స్పీకర్ పోచారం మాట్లాడారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News