Saturday, May 18, 2024
Homeపాలిటిక్స్Choutuppal: భువనగిరి ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్

Choutuppal: భువనగిరి ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్

అన్ని వర్గాల వారిని కలిసి..

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న భువనగిరి పార్లమెంటు ఎన్నికల్లో ఇంచార్జి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, చిరు వ్యాపారులను, తోపుడుబండ్ల వ్యాపారులను, మటన్ షాప్ నిర్వాహకులు హెయిర్ స్టైల్ నిర్వాహకులు, మిర్చి బండి నిర్వాహకులను కలిసి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. జాతీయ మెనిఫెస్టో కాపీలను వారికి అందించి వివరించారు.

- Advertisement -

ఆర్టీసీ బస్సులో ప్రయాణం..

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ ఆర్టీసీ బస్సులో కండక్టర్ వద్ద టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించిన భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి.

ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News