గాంధీ భవన్ లో మూడు పార్లమెంట్ నియోజక వర్గాల మైనార్టీ నాయకులతో సమావేశం అయిన ఏఐసీసీ ఇంఛార్జి దీపా దాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్, రోహన్ చౌదరి. సికింద్రాబాద్, చేవెళ్ల, హైదారాబాద్ పార్లమెంట్ నియోజక వర్గాల మైనార్టీ నాయకుల సమావేశం. సికింద్రాబాద్, హైదారాబాద్ నియోజక వర్గాలలో పట్టు కోసం కాంగ్రెస్ వరుస సమీక్షలు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/01/4-1024x443.jpg)
గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్, హైదారాబాద్ పార్లమెంట్ పరిధిలో సరైన ఫలితాలు రాకపోవడం తో ఈ నియోజక వర్గాల పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి మంచి ఫలితాలు సాధించాలి అని అన్న దీపా దాస్ మున్షీ.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/01/2-1024x841.jpg)
మూడు పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో బలాలు బలహీనతలు అంచనా వేసుకుని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించే విధంగా నాయకులు కృషి చేయాలి. BRS, బీజేపీ ఎత్తుగడలు తిప్పి కొట్టి ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా నాయకులు కృషి చేయాలన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/01/1-1024x603.jpg)