Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Congress SC St declaration: ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ మహాసభను జయప్రదం చేద్దాం

Congress SC St declaration: ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ మహాసభను జయప్రదం చేద్దాం

18వ తేదీన జరిగే సభకు ముఖ్య అతిథిగా ఖర్గే

చేవెళ్లలో మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ మహాసభ ఆగస్టు 18న సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ తెలిపారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సన్నాహక సమావేశంలో భాగంగా నియోజకవర్గ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని యూత్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ ఎలాగైతే చేసిందో ఎస్సీ ఎస్టీల డిక్లరేషన్ కూడా చేయడానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొంటారన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ ఎత్తున కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని ఈ సందర్బంగా వారు పిలుపునిచ్చారు. అందులో భాగంగా మండల కేంద్రంలో కె.వి.ఆర్ ఫరా కాలేజీలో సభస్థల పరిశీలన చేశారు.

- Advertisement -

నియోజకవర్గంలో జరిగే ఈ సభ లక్ష మందితో నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ యాదవ్, ఎనుగంటి మధుసూదన్ రెడ్డి, చల్ల నరసింహారెడ్డి, చింపుల సత్యనారాయణ, వెంకటస్వామి, సున్నపు వసంతం, భీంభారత్, షాబాద్ దర్శన్, దేవర వెంకటరెడ్డి, ఆగి రెడ్డి, గోనె ప్రతాప్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మధుసూదన్ గుప్తా, జనార్దన్ రెడ్డి, రాములు శ్రీనివాస్ గౌడ్, గౌరీ సతీష్, పెంటా రెడ్డి, టేకులపల్లి శ్రీనివాస్, ప్రభాకర్,5 మండలాల అధ్యక్షులు, మధుసూదన్ రెడ్డి,బి శ్రీనివాస్, వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News