టిడిపి పార్టీలోకి వలసలు వస్తున్నవారిని నందికొట్కూరు టిడిపి ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. కల్లూరు అర్బన్ 32వ వార్డ్ ముజఫర్ నగర్ కి చెందిన 50 మంది యువకులు బాషా అధర్వ్యంలో, టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ లో చేరారు. వీరిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని టిడిపి ప్రభుత్వం వస్తే పాణ్యం నియోజవర్గం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
పార్టీలో చేరిన వారు రాజశేఖర్, రవి కుమార్, గణేష్, సమీర్, ఫయాజ్, బాషా, మద్దిలేటి, మహేష్, శేఖర్, కృష్ణ, సమ్యూల్, రవీంద్ర సయ్యద్, ఖలీల్, సమీర్, హరి కృష్ణ, ఇబ్రహీం తదితరులు చేరారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు కే పార్వతమ్మ పాల్గొన్నారు.
Gauru Venkata Reddy: టీడీపీలోకి భారీగా వలసలు
జిల్లాలో టీడీపీలోకి పెరుగుతున్న వలసలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES