Saturday, July 27, 2024
Homeపాలిటిక్స్Allagadda: భూమా అఖిల సమక్షంలో టీడీపీలోకి వంద కుటుంబాలు

Allagadda: భూమా అఖిల సమక్షంలో టీడీపీలోకి వంద కుటుంబాలు

కర్నూలులో రాజుకుంటున్న రాజకీయ సెగ

ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరు గ్రామం లో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో ఆర్ల నాగ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సుమారు వంద కుటుంబాలు టిడిపి పార్టీలో చేరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పార్టీలో చేరిన గజగూడూరు బిబి, చల్లా వేంకటేష్, జాఫర్ వలి, సుబ్బారెడ్డి,మాహున్ని ,అమ్మిరానా, కౌశియా, హాజీరా, నాజీమానా వారి అనుచర వర్గం కుటుంబం అందరికీ టిడిపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారందరినీ వారు అభినందించారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ వైసీపీ అనుసరిస్తున్న విధానాలను నచ్చక నియోజకవర్గంలో టిడిపిలో చేరుతున్నారన్నారు. వైసీపీ నాయకులు చెప్పేది అబద్ధాలని తెలిసిపోయింది అన్నారు. 2024 శాసనసభ ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి చాంద్ భాషా కౌన్సిలర్ హుస్సేన్ భాష , నన్నే భాయ్ గారి జిలాని, టిడిపి నాయకులు గ్రామ నాయకులు భూమా అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News