Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్Jammikunta: కాంగ్రెస్ జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న కోటి

Jammikunta: కాంగ్రెస్ జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న కోటి

23 ఏళ్లు పార్టీలో పనిచేశా

జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్నకోటి హైదరాబాదులో మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ నియోజక ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాధర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేశిని స్వప్నకోటి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. తాను 1995నుండి కాంగ్రెస్ పార్టీ కార్య కర్తగా పని చేశానని, ఎన్ ఎస్ యూఐ మండల అధ్యక్షుడిగా, కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా, ఇల్లందకుంట ఆలయ చైర్మన్ గా పని చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా పని చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి తనకు అండగా నిలిచిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని అన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ వీడాల్సి వచ్చిందన్నారు. కానీ మళ్లీ కాంగ్రెస్ కండువ మెడలో వేసుకున్న తర్వాత తనకు గొప్ప అనుభూతి కలిగిందన్నారు.

- Advertisement -

23 సంవత్సరాలు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో పని చేసానని గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, వొడితల ప్రణవ్ బాబు నాయకత్వంలో పార్టీ బలోపేతానికి, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వారిలో బోగంపాడు మాజీ సర్పంచ్ జిల్లెల్ల తిరుపతి రెడ్డి, చెల్పూర్ మాజీ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ కళ్ళం సత్యనారాయణ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, గణేష్, ఓదెలు, విక్రమ్, దేశిని శ్రీనివాస్, ఉడుత వెంకటేష్, దేవరాజ్, రామారావు, సంకిష సురేష్, రామచంద్రం, రాజకుమార్, ఓజ్జ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News