Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Janagama: మ్యాటర్ సెటిల్ చేసిన కేటీఆర్, ముత్తిరెడ్డి-పల్లా మధ్య రాజీ

Janagama: మ్యాటర్ సెటిల్ చేసిన కేటీఆర్, ముత్తిరెడ్డి-పల్లా మధ్య రాజీ

తెరముందు, తెరవెనుక అంతా కేటీఆర్ మాయే

నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలంటూ పిలుపునిచ్చిన కేటీఆర్..ఎన్నికల ప్రచారంలో తెరపైన, తెరవెనుక అంతా తానై వన్ మ్యాన్ షో నడుపుతున్నారు. మొన్న రాజయ్య-కడియం మధ్య పంచాయతీ తీర్చి, రాజీ కుదిర్చిన కేటీఆర్ తాజాగా ఉమ్మడి వరంగల్ లోని జనగామ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా పల్లాకు ముత్తిరెడ్డికి మధ్య ఉన్న విభేదాలను స్వయంగా కేటీఆర్ పరిష్కరించి, రాజీ కుదిర్చారు. దీంతో ప్రస్తుతానికి జనగామ కథ కొలిక్కి వచ్చినట్టైంది. ఇలా బీఆర్ఎస్ జనగామ క్యాడర్ లో నయా జోష్ నింపారు కేటీఆర్.

- Advertisement -

జనగామ జిల్లాలో 3 సీట్లు మనమే కైవసం చేసుకోవాలి జనగామ BRS పార్టీ సమన్వయ సమావేశంలో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హైదరాబాద్, మంత్రుల నివాసంలో గల క్లబ్ హౌజ్ లో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జనగామ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, TSRTC చైర్మెన్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రైతు బంధు సమితి చైర్మెన్, ఎమ్మెల్యే డా. టి రాజయ్య, మాజీ ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, నారదాసు లక్ష్మణ్ రావు, జనగామ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో BRS పార్టీని జనగామ జిల్లాలో 3 నియోజకవర్గాల్లో గెలిపించడానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ నెల 16న జనగామలో నిర్వహించే ఎన్నికల మొదటి సభను విజయవంతం చేయాలని నాయకులకి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News