Tuesday, September 17, 2024
Homeపాలిటిక్స్Karnataka: ఇవే నా చివరి ఎన్నికలు: సిద్ధరామయ్య

Karnataka: ఇవే నా చివరి ఎన్నికలు: సిద్ధరామయ్య

కర్నాటకకు ఈ ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలే తన చివరి ఎన్నికలని ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసేది లేదని తేల్చి చెప్పారు మాజీ సీఎం సిద్ధరామయ్య. మే 2023న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా ఈ ఎన్నికల తరువాత తాను ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై కొట్టినప్పిటికీ తాను రాజకీయాల్లో తాను కొనసాగుతానంటూ స్పష్టత కూడా సిద్ధూ ఇచ్చారు. సీనియర్ కాంగ్రెస్ నేతగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో కొనసాగుతున్న సిద్ధూ, ఎలాగైనా ఈసారి సీఎం పీఠం అధిరోహించాలని తాపత్రయ పడుతున్నారు. కాగా కర్నాటక కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్థిగా కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఉంటారా లేక సిద్ధూ ఉంటారా అన్నదానిపై కాంగ్రెస్ హై కమాండ్ ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News