Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్Katasani: పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు

Katasani: పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు

పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాలని పాణ్యం ఎమ్యెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశించారు. కాటసాని ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని, కల్లూరు మండలం ఏ. గోకులపాడులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రతీ గడపకు వెళ్లిన ఎమ్యెల్యే రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న జనరంజక పాలన, అవినీతి రహిత పాలన గురించి ప్రజలకు వివరించారు. జగనన్న ప్రభుత్వాన్ని దీవించాలని ఆయన కోరారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి అందేలా చూడాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గిడ్డమ్మ,ఏ గోకులపాడు గ్రామ వైఎస్సార్ సీపీ నాయకులు, మధుసూదన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మహేశ్వర రెడ్డి, శంకర్ రెడ్డి, శ్యామసుందర్ రెడ్డి, అభి, గౌరు హనుమాన్ రెడ్డి, దిన్నే శివశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, పెద్దపాడు శ్రీధర్ రెడ్డి, కల్లూరు జడ్పీటీసీ ఆల ప్రభాకర్ రెడ్డి, కల్లూరు సింగిల్ విండో ప్రెసిడెంట్ శివ శంకర రెడ్డి, కర్నూలు జిల్లా కెడిసిసి బ్యాంక్ డైరెక్టర్ కళ్ళ వెంకట రమణారెడ్డి,కార్పొరేటర్లు దండు లక్ష్మీకాంత్ రెడ్డి, నారాయణరెడ్డి, తిరుపాల్, కల్లూరు మండల జేసిఎస్ ఇంఛార్జ్ కేశవరెడ్డి, సల్కాపురం సర్పంచ్ మద్దిలేటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ హనుమంతు రెడ్డి, కెవి.రమణారెడ్డి, తిరుమలేష్ గౌడ్, ఇంకా నియోజకవర్గ పరిధిలోని పలువురు నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News