Sunday, September 8, 2024
Homeపాలిటిక్స్KTR: పార్టీని కష్టకాలంలో వదిలి పోతున్నారు

KTR: పార్టీని కష్టకాలంలో వదిలి పోతున్నారు

కేటీఆర్ ఆవేదన వినేదెవరో?

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ప్రసంగించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశానికి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు.

- Advertisement -

కేటీఆర్ కామెంట్స్

కేకే, కడియం ఇలాంటి నాయకులు పార్టీ కష్ట కాలంలో వదిలిపెట్టి వెళ్తున్నారని, పోయే నాయకులు వెళ్లేటప్పుడు కొన్ని రాళ్లు వేసి వెళ్తారని, వాళ్ళు చేస్తున్న విమర్శలపైన వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నట్టు కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందన్న ఆయన, ఈరోజు నాయకులు పార్టీని వదిలేసినా… పార్టీ శ్రేణుల కోసం నేను స్వయంగా పనిచేస్తానని కేటీఆర్ చెప్పుకురావటం విశేషం.

ఇన్ని రోజులు పార్టీ కోసం, నాయకుల కోసం పనిచేసిన కార్యకర్తల కోసం నేను స్వయంగా వస్తా.. రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గెలిపించుకుంటా అని కేటీఆర్ హమీ ఇచ్చారు. రంజిత్ రెడ్డి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరారని, 2014లో విశ్వేశ్వర్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఎంపీగా చేసినం… 2019లో రంజిత్ రెడ్డి మాధురి పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరితే చేవెళ్ల ప్రజల చైతన్యంతో ఓడిపోయినారని గుర్తుచేశారు. కెసిఆర్ కూతురు అరెస్ట్ అయిన రోజు నవ్వుకుంటూ కాంగ్రెస్లోకి పోయిన రంజిత్ రెడ్డి… పట్నం మహేందర్ రెడ్డిల పైన మన పార్టీ కార్యకర్తలు పగ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.

ఇదే మహేందర్రెడ్డి, రంజిత్ రెడ్డిలు మళ్ళీ వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా పార్టీలోకి రానీయం అంటూ హెచ్చరించారు. మల్కాజిగిరిలో పోటీ చేయాలని సీఎంకే విసిరిన సవాలు రేవంత్ రెడ్డి స్పందించ లేదని, ఆయన సొంత సిట్టింగ్ ఎంపి స్థానంలోనే పోటీకి వెనకంజ వేసిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సీట్లను గెలిపిస్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడన్నారు. రేవంత్ రెడ్డి లీకు వీరుడుగా మారిండు… ఎన్నికల హమీలపై ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే ఈ డ్రామాలు అన్నారు.

రైతులకు రుణమాఫీ, 4000 పించన్లు, 2500 మహిళలకు, అందరికీ ఉచిత కరెంటు ఇలాంటి అన్ని హమీలు తుంగలో తొక్కారని, ఆరు గ్యారంటీలు పోయినవి, ఆరు గారఢీలు మిగిలినవి అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ వర్గం ఈ రోజు కాంగ్రెస్ పాలనలో సంతోషంగా ఉన్నారో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇయ్యాలని, రేవంత్ 5 ఏండ్లు ప్రభుత్వంలో ఉండు.. నీ 420 హమీలు నేరవేర్చు… నీకు నల్లగొండ, ఖమ్మం నాయకులే మానవబాంబులైతరు అని హెచ్చరించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఅర్ఎస్ బిజెపి బీ-టీమ్ అన్నారని, కానీ ఎన్నికల తర్వతా రేవంత్ రెడ్డి బిజెపి బీ-టీమ్ గా మారిండన్నారు. రేవంత్ రెడ్డి.. రాహుల్ రెడ్డి కోసం పనిచేస్తున్నారా… లేదా మోడీ కోసమా చెప్పాలన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్ల కన్నా ఎక్కువ వచ్చే పరిస్ధితి లేదు… బిజెపిన అపేందుకు బలమైన స్ధానిక నేతలే అని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే, అది బిజెపికి లాభం అవుతుందన్నారు.

పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు… పార్టీకి అండగా ఉండేందుకు ముందుకు వచ్చిన గొప్ప నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్న ఆయన..బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అంటూ పేర్కొన్నారు. ఆయన కేవలం రంగారెడ్డి మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితుడని, రాష్ట్రంలో బలహీన వర్గాలకు ముఖ్యంగా ముదిరాజులకు అనేక సేవలు చేసిన నాయకుడు జ్ఞానేశ్వర్ అన్నారు. చేవెళ్లలో నిలబడ్డది కాసానికి జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్ అన్నట్టుగానే పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలన్నారు.

తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతుక కేసిఅర్ ని బలోపేతం చేయాలని, ఈ ఎన్నికల్లో బిసిలకు అత్యధిక స్ధానాలు ఇచ్చిన పార్టీ బిఅర్ఎస్ అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News