Monday, May 20, 2024
Homeపాలిటిక్స్KTR with Chevella leaders: అధికారం, ఆస్ధుల కోసమే రంజిత్ రెడ్డి పార్టీ మారారు: ...

KTR with Chevella leaders: అధికారం, ఆస్ధుల కోసమే రంజిత్ రెడ్డి పార్టీ మారారు: కేటీఆర్

చేవెళ్ల గులాబీ లీడర్లతో కేటీఆర్ భేటీ

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమయ్యారు. బిఅర్ ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డి పైన కేటీఆర్ ఘాటైన కామెంట్స్ చేశారు. రంజిత్ రెడ్డి ఎవరో మన పార్టీ సీటు ఇచ్చి, గెలిపించుకున్న తర్వాతనే ప్రపంచానికి తెలిసిందన్న కేటీఆర్, 2019 లో రాజకీయాలకు కొత్త అయినా పార్టీలో ఉన్న, ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఆయనను గెలిపించారని గుర్తుచేశారు. రంజిత్ రెడ్డికి రాజకీయంగా పార్టీలో అత్యధిక ప్రాధాన్యత కూడా ఇచ్చాము, నియోజక వర్గంలో స్వేచ్చ ఇచ్చామని చెప్పిన ఆయన.. ఈ ఎన్నికల్లో పోటీ చేయను అని పార్టీ ముందు అశక్తతను వ్యక్త్యం చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పి, కేవలం అధికారం, ఆస్ధుల కోసమే రంజిత్ రెడ్డి బిఅర్ఎస్ పార్టీని విడిచి ద్రోహం చేశారని కేటీఆర్ ఆరోపించారు.

- Advertisement -

పార్టీ సీనియర్ నాయకురాలు… రంజిత్ రెడ్డి తన సోదరి అని చెప్పుకుని కవిత పైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోదాల పేరుతో దాడి చేసి… అరెస్టు చేసిన రోజే.. ఆయన నవ్వుకుంటూ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరిన స్వార్థపరుడని కేటీఆర్ నిప్పులు చెరిగారు. బిఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాదు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా రంజిత్ రెడ్డికి పార్టీ ఏం తక్కువ చేసిందని, పార్టీకి మోసం చేసి వెళ్ళాడు అని చర్చించుకుంటున్నారన్నారు.

గతంలో ఎన్నికలకు ముందు అప్పటి మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కూడా పార్టీ కన్నా తానే ఎక్కువ అనుకొని ఇతర పార్టీలోకి వెళితే ఫలితం ఏమైందో అందరికీ తెలుసన్న కేటీఆర్, ఒక పార్టీ కన్నా తానే పెద్ద అనే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో గెలవరని హెచ్చరించారు. అదే నిజమైతే దేశంలో పార్టీలు ఉండవని, స్వతంత్ర అభ్యర్థులే గెలుస్తారన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి మనుసులు కలిసినంత మాత్రాన… మిలాఖత్ అయినంత మాత్రాన.. కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసిపోతాయనుకోవడం వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమన్నారు కేటీఆర్. ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన అయోమయం నెలకొని ఉందని, చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థి కూడా దొరకలేదన్నారు. సొంతంగా అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీ, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యమన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో 13వ తేదీన కెసిఆర్ బహిరంగ సభ ఉంటుందని, సామాజిక సమీకరణాల రీత్యా కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు సులభం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు.

కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజులతో పాటు బీసీల కోసం కొన్ని దశాబ్దాలుగా అండగా నిలబడిన వ్యక్తి అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఒకవైపు బీసీల కోసం పాటుపడుతూనే, మరోవైపు అన్ని సామాజిక వర్గాలను, మైనార్టీలను కలుపుకుపోయిన మంచి మనిషి, నాయకుడు కాసాని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News