Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Mahabubnagar: నాగం కన్నుపడ్డా.. కాలు మోపినా అంతా భస్మమే..రాజకీయ సన్యాసానికి రెడీ

Mahabubnagar: నాగం కన్నుపడ్డా.. కాలు మోపినా అంతా భస్మమే..రాజకీయ సన్యాసానికి రెడీ

నాగం జనార్దన్ రెడ్డి కన్నుపడ్డా.. కాలు మోపినా ఆ ప్రాంతం అంతా భస్మమేనని.. నాగుపాముకు పాలు పోస్తే కాటేస్తుంది తప్ప కనికరించదని.. నాగం జనార్ధన్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నిప్పులు చెరిగారు. మనసు నిండా విషం పెట్టుకొని రాజకీయ లబ్ధి కోసమే దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. నాగం జనార్దన్ రెడ్డి 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అభివృద్ధి కన్నా రాజకీయ వ్యతిరేకులపై కేసులు పెట్టి వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. నాగం ఎన్నో మంత్రి పదవులు చేపట్టి తను లబ్ధి పొందారే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని తీవ్ర ఆరోపణలు చేశారు.

- Advertisement -

మార్కండేయ ప్రాజెక్టు పూర్తైతే తన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనే భయంతోనే ప్రాజెక్టు సందర్శించేందుకు వచ్చి.. కుల చిచ్చు రాజేస్తున్నారని జనార్ధన్ ఆరోపించారు. నల్లమట్టి అమ్ముకున్నాననే ఆరోపణలు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు రెడీ అని జనార్దన్ సవాల్ చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 22 సీట్లకు మించి గెలిస్తే తాను ఎమ్మెల్యేగా గెలిచినా, రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News