Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Janagama: తెలంగాణను అభివృద్ధి చేసింది కెసిఆరే

Janagama: తెలంగాణను అభివృద్ధి చేసింది కెసిఆరే

ఎలాగైనా గెలవాలని విపక్షాలు అగమైతున్నయి

రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కెసిఆర్ తోనే సాధ్యమైందని హోం మంత్రి మహ్మ్యూదాలి అన్నారు. జనగామ జిల్లా కేద్రం మైనార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, ప్రతిపక్షాలు ఆగమైతున్నయి. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారన్నారు. వాళ్లు చెప్పేవన్నీ అబద్ధాలేనని, వాళ్లతో అయ్యేది లేదు..పోయేది లేదని ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మైనార్టీలను చేరతీసినది కెసిఆర్ అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి, దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత సీఎంకు దక్కుతుందని కొనియాడారు. దేశంలోనే అత్యధిక మైనార్టీ గురుకులాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని, పథకాలకు ఆకర్శితులయ్యే వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారని చెప్పారు. పార్టీలోకి వచ్చిన వారు కొత్తపాత అనే తేడా లేకుండా అందరూ కలిసి కట్టుగా ఉండి పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి పొన్నాల, నాయకులు, మైనార్టీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News