Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Mallapur: కోరుట్ల కాంగ్రెస్ లో అసమ్మతి?

Mallapur: కోరుట్ల కాంగ్రెస్ లో అసమ్మతి?

రెబల్ గా పోటీ చేసే ఆలోచనలో సుజిత్ రావు, కరం చంద్

కాంగ్రెస్ పార్టీ లో టికెట్ ల మంట చల్లారేలా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కరు కాంగ్రెస్ ను విడుతున్నారు. కొందరేమో రెబల్ గా పోటీ చేస్తామని కాంగ్రెస్ అధిష్టానన్ని హెచ్చరిస్తున్నారు. కోరుట్ల నియోజకవర్గంలో టికెట్ ఆశించిన వారి పరిస్థితి అదేవిధంగా ఉంది. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా జువ్వాడి నర్సింగ రావుకు టికెట్ కేటాయించారు. జువ్వాడికి టికెట్ కేటాయించడంతో టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు, రాష్ట్ర నాయకులు కొమిరెడ్డి కరం ఆగ్రహంతో ఉన్నారు. వారి క్యాడర్ కాంగ్రెస్ పార్టీపై, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీని బ్రతికించిన తమ నేతకు టికెట్ ఇవ్వలేదని, పోటీలో ఉండాల్సిందేనని సుజిత్ రావు, కరంచంద్ ల అభిమానులు కోరుతున్నారు. నేతలు కూడా కార్యకర్తల అభిప్రాయం తీసుకుని రెండు మూడు రోజుల్లో తమ భవిష్యత్తు కార్యాచరణ తెలుపుతామని కార్యకర్తలతో తెలిపారు. సుజిత్ రావు, కరంచంద్ ఒకవేళ పోటీలో నిలిస్తే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, కాంగ్రెస్ ఓట్లు చిలిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు తెలుపుతున్నారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ లో ఏం జరగబోతోందో అని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News