Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్Modi on Kandukuru: కందుకూరు తొక్కిసలాట, మోడీ దిగ్భ్రాంతి

Modi on Kandukuru: కందుకూరు తొక్కిసలాట, మోడీ దిగ్భ్రాంతి

కందుకూరు తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందటంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిసిన మోడీ, మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50 వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈమేరకు పీఎంవో ట్వీట్ చేసింది. నెల్లూరు జిల్లాలోని కందుకూరులో చంద్రబాబు నాయుడు రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతిచెందారు. రోడ్ షో జరిగిన చోట ఓపన్ డ్రైనేజ్ కెనాల్ ఉండటంతో అందులో పడి తొక్కిసలాట జరగ్గా మృతుల్లో మహిళలు కూడా ఉన్నారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ యాత్ర నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పర్యటిస్తూ, రోడ్ షోలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News