Thursday, October 3, 2024
Homeపాలిటిక్స్Munugodu: సీఎం కేసీఆర్ మునుగోడు సభ సూపర్ సక్సెస్

Munugodu: సీఎం కేసీఆర్ మునుగోడు సభ సూపర్ సక్సెస్

రాజకీయ చైతన్యం ఉన్న మునుగోడు మూగబోరాదు

మునుగోడు ఆశీర్వాద సభ; సీఎం కేసీఆర్ ప్రసంగం ముఖ్యాంశాలు

- Advertisement -

• గతంలో ఉప ఎన్నిక జరిగితే మీరందరూ తీర్పు ఇచ్చినారు.
• 90 శాతం హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చాం
• రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. వంద పడకల ఆసుపత్రి నిర్మాణం అవుతున్నది.
• ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగమై ఓట్లు వేయద్దు.
• మనంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
• గతంలో పాలించిన కాంగ్రెస్ ఇక్కడి ప్రజల నడుములు వంగిపోయేదాకా చచ్చిపోయే దాక చూసిండ్రు.
• ఫ్లోరైడ్ నివారణ చేయలేదు
• వాజపేయి ప్రధానమంత్రి గా ఉన్నప్పుడు ఉద్యమ కారులు స్వామి అనే పిల్లవాడిని తీసుకెళ్లి ప్రధానమంత్రి టేబుల్ మీద పడుకోబెట్టిన్రు. అయినా నివారణ దొరకలేదు.

• బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఫ్లోరైడ్ నీళ్ల గోస పూర్తిగా ఏ విధంగా పోయిందో మీకందరికీ తెలుసు

• 24 ఏండ్ల పొద్దయింది. తెలంగాణ కోసం బయలు దేరి. 24 ఏండ్ల నాడు ఎవ్వడు లేడు. పిడికెడు మంది ఉన్నరు. అందులో ప్రభాకర్ రెడ్డి ఆనాటి నుంచి ఈ నాటి వరకు ఉన్నాడు. ఉద్యమంలో జైలుకు కూడా పోయాడు. మడమ తిప్పకుండా పోరాటం చేశాడు

• ఈ రోజు విమర్శలు చేసే వాళ్లు ఎవ్వడు ఏ చెట్టుకింద ఉన్నడో మీ అందరికి తెలుసు. ఎవ్వడి బూట్టు మోసుకుంటున్నడో మీకు తెలుసు

• ఫ్లోరైడ్ తో నడుములు వంగిపోయిన నాడు పట్టించుకోని వాడు ఈ రోజు నన్ను ఛాలెంజ్ చేస్తున్నారు.
• కేసీఆర్ నీకు దమ్మున్నదా; కొడంగల్ కాడా పోటీ చేస్తవా, గాంధీ బొమ్మకాడికి వస్తవా అని మాట్లాడుతున్నారు.

• తెలంగాణ ఉద్యమంలో మన తోటి ఉన్నదెవరో, లేని దెవరో మీరు కండ్లతోటి చూసినారు.

• రాజకీయాలలో ఎవరైతే పనికి మాలిన వాళ్లు ఉంటరో, ఎవరైతే డబ్బు మదంతో పనిచేసే వారుంటరో బుద్ధి చెప్పకపోతే ప్రజలు గెలువరు, ప్రజలు ఓడిపోతరు.

• పైసలు వస్తయి, పోతయి. ప్రజలకు డెవలప్మెంట్ కావాలి, సాగునీరు రావాలి. తాగునీళ్లు రావాలి, 24 గంటల కరెంటు రావాలి.
• భారత దేశంలో 24 గంటలు కరెంటు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా సాధ్యపడటం లేదు.

• కర్ణాటకలో కాంగ్రెస్ కరెంటు వాగ్ధానం చేసిందో కుప్పకూలిపోయిందో మీకు తెలుసు. 5 గంటలు కూడా కరెంటు ఇవ్వకపోవడంతో రైతులు ధర్నాలు చేస్తున్నారు.

• ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తల రాత మారుస్తుంది.

• తెలంగాణ తెచ్చిన తెల్లారి నుంచి అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చాం.
• పెన్షన్ ను వేలల్లో ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
• 93 లక్షల రేషన్ కార్డులున్న కుటుంబాలకు సన్నబియ్యంతోపాటు బీమా కల్పిస్తామని మెనిఫెస్టోలో చెప్పిన మాట మీకు తెలుసు

• మునుగోడు రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతం. చైతన్యం మూగ పోవద్దు. కమ్యూనిస్టుల జెండాలు ఎగిరిన ప్రాంతం , కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు ఉన్నటు వంటి ప్రాంతం

• ఫ్లోరైడ్ బాధ ఉంటే నేనే పాట రాసినా ఏమాయనే నల్లగొండ అంటూ

• పైసలు పట్టుకుని వచ్చే బేహార్లు, పూటకో పార్టీలు మార్చే బేహార్లు, ఏం చేసినా చేస్తారు. ముంచినా ముంచుతారు. వారికో నియమం లేదు. సిద్ధాంతం లేదు. నిబద్ధత లేదు. నిన్నో పార్టీ ఇవ్వాలో పార్టీ, రేపో పార్టీలో ఉంటారు.

• కేవలం డబ్బు మదంతో అహంకారంతో ప్రజలను కొనగలుగుతాం అంటున్నారు. అప్రమత్తంగా ఉండాలి

• నల్లగొండలో ఉన్న కమ్యూనిస్టు చైతన్యం కచ్చితంగా చూపించి ఇటువంటి బేహార్లకు బుద్ధి చెప్పాలి. రాజకీయ ప్రక్షాళన జరిగి లాభం జరుగుతుంది.

• పాలమూరు ఎత్తపోతల పథకం పూర్తయితే దిండికి , శివన్న గూడేనికి నీళ్లు వస్తయి.

• ఏడాదిన్నర లోపల రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు తెచ్చే బాధ్యత నాది

• కాంగ్రెస్ వస్తే కర్ణాటక మాదిరే కరెంటు లేకుండా అవుతుంది.

• ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి

• అవకాశం ఉంటే ఎన్నికల చివరి దశలో వచ్చే ప్రయత్నం చేస్తాను.

• నల్లగొండ ప్రజల చైతన్యంతో ధన బేహార్ల నుంచి కాపాడాలి.

సభలో మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూధన చారి , జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి , కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ , జల్లా మార్కాండేయ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News