Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Nagar Kurnool: దళితుల ఆత్మగౌరవం దెబ్బతీసింది కేసీఆరే: రేవంత్

Nagar Kurnool: దళితుల ఆత్మగౌరవం దెబ్బతీసింది కేసీఆరే: రేవంత్

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో దళిత గిరిజనుల ఆత్మగౌరవం దెబ్బతీయడమే కాకుండా వారిని హత్య చేసేందుకు కూడా వెనకాడడం లేదని ధ్వజమెత్తారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో హామీలు ఇచ్చిన ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో సందర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిని అడ్డుకోవటంతో పాటు.. దళిత గిరిజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై దాడి చేసి గొంతు మీద కాలు పెట్టి చంపేందుకు ప్రయత్నించడం దారుణములు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కార్యకర్తలు భుజాలపై వేసుకుని గెలిపిస్తారన్నారు రేవంత్. నాగం జనార్దన్ రెడ్డి తో పెట్టుకుంటే మర్రి నీవు ఆగమే అవుతావని రేవంత్ హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో గల బిజినపల్లి మండలంలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో రేవంత్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News