Monday, September 30, 2024
Homeపాలిటిక్స్Palakurthi Thikkareddy: ఇసుక సత్యాగ్రహాన్ని జయప్రదం చేయండి

Palakurthi Thikkareddy: ఇసుక సత్యాగ్రహాన్ని జయప్రదం చేయండి

29 ఉదయం 10 గంటలకు కౌతాళం మండలం, గుడికంబాలి గ్రామంలో..

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు… మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమ ఇసుక వ్యాపారంపై ఈనెల 29 మంగళవారం ఉదయం 10 గంటలకు కౌతాళం మండలం, గుడికంబాలి గ్రామం ఇసుక రీచ్ వద్ద తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఇసుక సత్యాగ్రహం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు బి.టి నాయుడు , ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు , మాజీ ఎమ్మెల్యే ఆలూరు ఇన్చార్జి, కోట్ల సుజాతమ్మ , ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బివి. జయ నాగేశ్వర రెడ్డి , పత్తికొండ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ కె.ఈ శ్యాంబాబు హాజరవుతున్నారు. కావున నియోజకవర్గ టీడీపీ మండల నాయకులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు, పార్టీ గ్రామ నాయకులు, బూత్ కన్వీనర్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, టీడీపీ కార్యకర్తలు, హాజరై..ఇసుక సత్యాగ్రహాన్నిజయప్రదం చేయవలసినదిగా కోరారు….

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News