Tuesday, September 17, 2024
Homeపాలిటిక్స్R Krishnayya: బీసీ బిల్లుకై మరో స్వాతంత్ర సమరం

R Krishnayya: బీసీ బిల్లుకై మరో స్వాతంత్ర సమరం

అక్టోబర్ మొదటివారంకు భారీ సదస్సు వాయిదా

‘చట్టసభలలో’ బీసీ బిల్లు సాధనకై మరో స్వతంత్ర సమరంలా జాతీయ ఉద్యమాన్ని నిర్మిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. ఈనెల 26న తలపెట్టిన సదస్సును భారీ స్థాయిలో నిర్వహించేందుకు అక్టోబర్ మొదటివారంకు వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాదులోని ‘బీసీ భవన్’లో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ..చట్టసభలలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల సాధన ఈ వర్గాల చిరకాల డిమాండ్ అని అన్నారు. ఉభయ సభలలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించేంత వరకు మా పోరాటం, అనేక దశలుగా, పలు రూపాలలో కొనసాగుతుందన్నారు. అన్ని పక్షాల, బీసీ సంఘాలు, కుల సంఘాలు ఏకమై ఈ ఉద్యమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. డాక్టర్ వకుళాభరణం మాట్లాడుతూ.. ‘మహిళా బిల్లుల్లో ‘ఓబీసీ సబ్ కోటాను’ చేర్చి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. 75 కోట్ల ఓబిసి డిమాండ్ ను తప్పక నెరవేర్చినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అన్నారు. బీసీల డిమాండ్లను కేంద్రం సానుకూలంగాపరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. గణేష్ నవరాత్రుల కారణంగా అనేకమంది ప్రముఖుల సూచనల మేరకు ఈ నెల ’26’న నిర్వహించాల్సిన “బీసీ బిల్లు” సాధన సదస్సును వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -


అక్టోబర్ మొదటి వారంలోగా నిర్ణయించి, భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీ సంఘాలు, సామాజిక వేత్తలు, వివిధ ప్రభుత్వ బాధ్యతల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ఈ అంశంపై పూర్తిస్థాయిలో పని చేసే నిపుణులను కూడా ‘బీసీ సదస్సు’కు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బీసీ కమిషన్ సభ్యుడు శుభ ప్రద్ పటేల్ నులి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, బి ఆర్ఎస్ నాగేంద్ర గౌడ్, బిఆర్ఎస్ నాయకులు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News