Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Revanth Reddy @ Prajadarabar: 'ప్రజాదర్బార్' లో గోడు చెప్పుకునేందుకు జనాలు క్యూ

Revanth Reddy @ Prajadarabar: ‘ప్రజాదర్బార్’ లో గోడు చెప్పుకునేందుకు జనాలు క్యూ

ప్రజలతో ప్రత్యక్షంగా కలుస్తున్న సీఎం

చెప్పిన మాట ప్రకారం ప్రజాదర్బార్ నిర్వహించారు కొత్త సీఎం రేవంత్ రెడ్డి. జ్యోతీబాపూలే ప్రజాభవన్ లో ఈమేరకు బారులు తీరిన ప్రజలను రేవంత్ కలుసుకుని, ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఇకమీదట ప్రజాదర్బార్ ను క్రమం తప్పకుండా నిర్వహించి, ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలను నెరపనున్నట్టు సీఎంవో వెల్లడించింది. ఇక రాష్ట్రం నలుమూలల నుంచి ఉదయం నుంచే చలిలో బారులు తీరినవారిని రేవంత్ కలుసుకున్నారు. ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లో ప్రజా సమస్యలను నమోదు చేసి, వాటిని తక్షణం పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News