Thursday, September 19, 2024
HomeఆటDundigal: దుండిగల్ పీఎస్ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్

Dundigal: దుండిగల్ పీఎస్ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్

విన్నర్లు భౌరంపేట్ ఇందిరమ్మ కాలనీ టీం

సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఐపీఎస్ సూచన మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పొలిసింగ్, ఫ్రెండ్లీ పొలిసింగ్ లో భాగంగా మెగా క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు.

- Advertisement -

ఈ టోర్నమెంట్ లో దుండిగల్ పీఎస్ పరిధిలోని రెవెన్యూ, మున్సిపల్ ఉద్యోగులు, పోలీస్ ఉద్యోగులు, ప్రెస్ సోదరులు, పలు గ్రామాల, కాలనీల యువకులు పాల్గొన్నారు. మొత్తంగా 10 రోజులు నిర్వహించిన ఈ ఈవెంట్ లో 14 జట్లు పాల్గొనగా భౌరంపేట్ ఇందిరమ్మ కాలనీ, గండి మైసమ్మ యువకుల టీమ్స్ ఫైనల్లో తలపడగా భౌరంపేట్ ఇందిరమ్మ కాలనీ యువకుల జట్టు ఫైనల్ ట్రోఫీని గెలుపొందారు. అనంతరం గెలుపొందిన జట్టుకి ముఖ్య అతిధిగా పాల్గొన్న డిసిపి కోటిరెడ్డి ట్రోఫీని అందచేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలను, కాలనీల ప్రజలను పోలీసులతో స్నేహా పూర్వకంగా ఉంటూ, ఒకరికొకరు సహకరించుకునేందుకు ఇటువంటి టోర్నీలను నిర్వహస్తున్నామని తెలియజేసారు. ఈ టోర్నీ నిర్వహణకు సహకారం అందచేసిన కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో దుండిగల్ పోలీస్ స్టేషన్ సిఐ సతీష్, ఎస్ఐ లు రామ్మోహన్ రెడ్డి, శంకర్, డిఐ సతీష్, భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News