IND-ENG Series: కొన్ని రోజుల్లో ఇండియా-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్ కు ఇరు జట్ల దిగ్గజ క్రికెటర్లు టెండూల్కర్ – అండర్సన్ ట్రోఫీగా నామకరణం చేశారు. గతంలో ఈ సిరీస్ కు పటౌడీ ట్రోఫీ(Pataudi Trophy) అనే పేరు ఉండేది. ఇప్పడు ఆ పేరు తీయడంపై మాజీ ఆటగాళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ఉండటం గమనార్హం. తన పేరు మీద సిరీస్ పెట్టడం సచిన్ కు నచ్చలేదు.
దిగ్గజ క్రికెటర్ అయిన పటౌడీ పేరును తొలగించడం సమంజసం కాదని బీసీసీఐ, ఈసీబీకి రిక్వెస్ట్ చేశాడు. దీంతో సచిన్ విజ్ఞప్తి మేరకు రెండు బోర్డులు టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ పేరును తొలగించి పటౌడీ ట్రోఫీగా కొనసాగించాలని నిర్ణయించాయి. పేరు మార్పు విషయంలో ఐసీసీ ఛైర్మన్ జై షా కూడా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సచిన్ రిక్వెస్ తో ఇకపై పటౌడీ పేరుతోనే రెండు జట్ల టెస్టు సిరీస్ ల ట్రోఫీ కొనసాగిస్తామని ఇంగ్లాండ్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు.
కాగా 2025-27 వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ సీజన్ కూడా ఇంగ్లండ్ – ఇండియా సిరీస్తోనే ప్రారంభం కానుంది. జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు ఐదు టెస్టు మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పటికే రెండు జట్లు ప్రాక్టీస్ కూడా ప్రారంభించాయి. భారత జట్టు ఇండియా ఏ జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడింది. ఇక భారత జట్టుకు యువ ఆటగాడు శుభమన్ గిల్ కెప్టెన్సీ వహిస్తున్నాడు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తో యువ భారత్.. పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. ఈ సిరీస్ గిల్ సేనకు నిజంగా కఠిన సవాలుగా మారనుంది.
భారత జట్టు: అభిమన్యు ఈశ్వరన్, శుభమన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్థూల్ ఠాకూర్, ధృవ్ జురెల్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.