IND vs ENG: ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కోసం గాయపడిన అర్ష్దీప్ సింగ్ స్థానంలో భారత ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ జట్టులో చేరనున్నారు. జులై 23 నుంచి మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సమయంలో భారత బౌలర్ అర్ష్దీప్ చేతికి గాయమైంది. దీంతో అతని స్థానంలో హర్యానా బౌలర్ అన్షుల్ కాంబోజ్ను జట్టులోకి తీసుకున్నారు.
రంజీలో అద్భుత ప్రదర్శన
రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో మొత్తం 10 వికెట్లు తీసిన మూడవ బౌలర్గా అన్షుల్ కాంబోజ్ రికార్డుకెక్కాడు. 2024-25 సీజన్ రంజీ ట్రోఫీలో కేరళతో రోహ్తక్లో జరిగిన ఐదవ రౌండ్ మ్యాచ్లో హర్యానా తరఫున ఇతను 30.1 ఓవర్లలో 10/49గా నమోదు చేసి అద్భుతమైన ఘనతను సాధించాడు.
ఇలాంటి ప్రదర్శనతో 24 ఏళ్ల అన్షుల్ కాంబోజ్ రంజీ ట్రోఫీ చరిత్రలో నిలిచిపోయే రికార్డును సాధించాడు. అయితే ఈ రికార్డులో ఇతని కంటే ముందు బెంగాల్కు చెందిన ప్రేమాంగ్షు ఛటర్జీ (10/20), ప్రదీప్ సుందరం (రాజస్థాన్) (10/78) తర్వాత మూడో ఆటగాడిగా అన్షుల్ కాంబోజ్ నిలిచాడు. తన కెరీర్లోని ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 3.10 ఎకానమీ, 22.88 సగటుతో 79 వికెట్లు పడగొట్టాడు.
ఇదే విధంగా.. ఐదు మ్యాచ్ల టెండూల్కర్-అండర్సన్ టెస్టు సిరీస్లో 1-2 తేడాతో సిరీస్లో భారత్ వెనుకబడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జులై 23 నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టులో ఎట్టిపరిస్థితుల్లో గెలవాలని టీమ్ఇండియా కసరత్తులు చేస్తుంది. మరోవైపు 3వ టెస్టులో అద్భుతమైన విజయంతో ఇంగ్లండ్ సిరీస్ పై కన్నేసింది.


