Wednesday, June 11, 2025
HomeఆటMS Dhoni: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు.. ధోనీ ఏమన్నారంటే..?

MS Dhoni: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు.. ధోనీ ఏమన్నారంటే..?

ఉంటాడు. 2007లో భారత జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టిన మొదట్లోనే టీ20 వరల్డ్ కప్ అందించాడు. అప్పటి నుంచి తన కెప్టెన్సీ, ఆటతో టీమిండియాను అద్భుతంగా తీర్చిదిద్దాడు. ధోనీ కెప్టెన్సీలో భారత్ దూకుడుంగా ఆడటం మొదలుపెట్టింది. ఎంతో మంది యువ ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. 2011లో 28 ఏళ్ల తర్వాత భారత జట్టుకు ప్రపంచకప్ తెచ్చి పెట్టాడు. 2013లో ఛాంపియన్స్ ట్రోపీ కూడా గెలిచేలా జట్టును ముందుండి నడిపించాడు. ఇక ఐపీఎల్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఐదు సార్లు టోర్నీ ఛాంపియన్ గా నిలిపాడు.

అలాంటి ధోనీకి మరో అరుదైన గౌరవం దక్కింది. 2025 ఏడాదికి గానూ ఐసీసీ ప్రకటించిన హాల్ ఆఫ్ ఫేమ్‌(Icc Hall Of Fame)లో చోటు ద‌క్కించుకున్నాడు. ధోనీతో పాటు మాజీ క్రికెటర్లు గ్రేమ్ స్మిత్ (ద‌క్షిణాఫ్రికా), హ‌షీమ్‌ ఆమ్లా (ద‌క్షిణాఫ్రికా), మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా), డేనియెల్‌ వెటోరి (న్యూజిలాండ్‌), సారా టేలర్ (మహిళా క్రికెటర్‌, ఇంగ్లాండ్‌), సనా మీర్‌ (మహిళా క్రికెటర్‌, పాకిస్తాన్‌) కూడా జాబితాలో స్థానం పొందారు.

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు ద‌క్కించుకోవ‌డంపై ధోని స్పందించాడు. ఇది గొప్ప గౌర‌వం అని చెప్పాడు. దిగ్గ‌జ ఆట‌గాళ్ల‌తో పాటుగా తన పేరును గుర్తుంచుకోవ‌డం ఎప్ప‌టికి నిలిచిపోయే గొప్ప అనుభూతి అని సంతోషం వ్యక్తం చేశాడు. కాగా 2020లో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ.. మూడు ఫార్మాట్ల‌లో క‌లిపి 17,266 ప‌రుగులు సాధించాడు.

2009లో హాల్ ఆఫ్ ఫేమ్‌ను ప్రకటించడం ప్రారంభించిన ఐసీసీ ఇప్ప‌టివ‌ర‌కు 122 మంది క్రికెట‌ర్లకు చోటు కల్పించింది. ఇక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో ధోనీ కంటే ముందు 10 మంది భారత ఆటగాళ్లు స్థానం దక్కించుకున్నారు. వీరిలో సునీల్ గవాస్కర్, బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వినూ మన్కడ్, డయాన్ ఎడుల్జీ(మహిళా క్రికెటర్), వీరేంద్ర సెహ్వాగ్, నీతు డేవిడ్(మహిళా క్రికెటర్) ఈ గౌర‌వాన్ని అందుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News