Saturday, February 22, 2025
HomeఆటChampions Trophy 2025: భారత్ జట్టు కొత్త జెర్సీపై పాకిస్థాన్ పేరు

Champions Trophy 2025: భారత్ జట్టు కొత్త జెర్సీపై పాకిస్థాన్ పేరు

రేపటి నుంచి ఛాంపియన్స్‌ ట్రోఫీ (ICC Champions Trophy 2025) ప్రారంభంకానున్న సంగతి తెలసిందే. టీమిండియా(Team India) తన తొలి మ్యాచ్‌ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇప్పటికే భారత జట్టు దుబాయ్ చేరుకుంది. ఈ నేపథ్యంలో కొత్త జెర్సీలో జట్టు సభ్యులు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ పోస్ట్ చేసింది. అయితే ఈ జెర్సీలో టోర్నీకి ఆతిథ్యమిచ్చే పాకిస్థాన్‌ పేరు ఉండటం గమనార్హం. దీనిపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఐసీసీ టోర్నీల్లో కచ్చితంగా నిబంధనలు పాటించాలని తెలిపింది. ఈ నిబంధనల ప్రకారం టోర్నీకి ఆతిథ్యమిచ్చే దేశం పేరును జెర్సీ మీద ముద్రించాలని పేర్కొంది. ట్రోఫీకి సంబంధించిన లోగోపై తమ దేశం పేరు ఉండేందుకు ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్‌కు హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News