Saturday, July 27, 2024
HomeఆటPatnam: తెలంగాణాలో క్రీడలకు సీఎం పెద్దపీట

Patnam: తెలంగాణాలో క్రీడలకు సీఎం పెద్దపీట

గ్రామీణ క్రీడా వికాసం కోసం 18,000 క్రీడా ప్రాంగణాలు

భారీగా ప్రోత్సాహకాలు, క్రీడా పాలసీతో దేశానికి పేరు తేనున్న క్రీడాకారుల నైపుణ్యం మరింత మెరుగుపడాలని, క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని మంత్రి మహేందర్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రముఖ క్రీడాకారిణి జ్వాల గుత్త మొయినాబాద్ అకాడమీలో అండర్ 15,17 బాల, బాలికల 36వ యోనెక్స్ సన్ రైస్ సబ్ జూనియర్ జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలను మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు. జ్వాలా గుత్త, బారత జాతీయ బ్యాట్ మెంటెన్ వైస్ ప్రెసిడెంట్
శేఖర్ బిస్వా, బ్యాట్ మెంటెన్ అసోషియేషన్ కోశాధికారి వంశి, శాట్ ఎండీ లక్ష్మి తదితరులు పాల్గొన్న కార్యక్రమంలో దేశం లోని 33 రాష్ట్రాల నుంచి 560 మంది క్రీడాకారులు పాల్గొన్న సందర్భంగా
ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే మహోన్నతంగా తెలంగాణ లో క్రీడా పాలసీ రానుందన్నారు.
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో 18 వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు.

- Advertisement -


గతంలో పీవీ సింధు, సానియా మీర్జా ఇలాంటి క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సహించిందని వివరించారు.
మంత్రి కేటీఆర్ సహకారంతో జ్వాలా గుత్త అకాడమి, ఇతర అకాడమీలకు పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. దేశానికి వన్నెతెచ్చే తెలంగాణ క్రీడా పాలసీ కోసం మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులతో కూడిన మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సుల మేరకు మౌలిక సదుపాయాల కల్పన తదితర పలు అంశాలను అమలు పరచనున్నారన్నారు.



పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరిగే విధంగా పాఠ్యాంశాలలో భాగం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మహేందర్ రెడ్డి వివరించారు. తెలంగాణకు చెందిన విద్యార్థులతో పాటు
పలు రాష్ట్రాల క్రీడాకారులతో మంత్రి మాట్లాడి వారిని ప్రోత్సహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News