Sunday, July 7, 2024
HomeఆటVijayanagar won Kabaddi trophy: రాష్ట్ర మహిళా కబడ్డీ విజేత విజయనగరం

Vijayanagar won Kabaddi trophy: రాష్ట్ర మహిళా కబడ్డీ విజేత విజయనగరం

నువ్వా నేనా అంటూ సాగిన ఫైనల్ మ్యాచ్

మండల కేంద్రమైన గోనెగండ్ల రిటైర్డ్ హెడ్మాస్టర్ మాజీ కబడ్డీ క్రీడాకారుడు స్మారకార్థం జరుగుతున్నటువంటి 70వ రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలు చివరి రోజైన మూడవరోజు ఉత్కంఠ భరితమైన ఫైనల్ మ్యాచ్లో శ్రీకాకుళం విజయనగరం జట్లు తలపడ్డాయి ఈ మ్యాచ్లో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా తలబడ్డాయి అయితే శ్రీకాకుళం జట్టుపై విజయనగరం జట్టు విజయాన్ని సాధించి ప్రథమ బహుమతిని సాధించింది అంత ముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో విశాఖపట్నం విజయనగరం జట్లు శ్రీకాకుళం గుంటూరు జట్లు తలపడ్డాయి ఈ రెండు మ్యాచ్లో విశాఖపట్నం పై విజయనగరం గుంటూరుపై శ్రీకాకుళం చెట్లు గెలుపొంది పైనల్ కు చేరాయి. ఫైనల్ కు చేరిన విజయనగరం శ్రీకాకుళం చెట్లు మ్యాచ్ ఉత్కంఠ రేపు తూ ప్రేక్షకులకు ఉత్సాహాన్నిచ్చింది ఈలలు కేకలు చప్పట్లతోకేరింతలు కొడుతూ ప్రేక్షకులు క్రీడా మైదానాన్ని హోరెత్తించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మిగనూరు నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, ఎమ్మిగనూరు రూరల్ సీఐ మోహన్ రెడ్డి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ లు హాజరయ్యారు మొదటి బహుమతి గెలుపొందిన విజయనగరం చెట్టుకి వైసీపీ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా మొదటి బహుమతిని అందజేశారు రెండవ బహుమతిని గెలుపొందిన శ్రీకాకుళం జట్టుకు రూరల్ సీఐ మోహన్ రెడ్డి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ లు ట్రోఫీని అందజేశారు మూడు నాలుగు బహుమతులను విశాఖపట్నం గుంటూరు జట్లకు ఆంధ్ర క్రీడా సంఘం జనరల్ సెక్రెటరీ శ్రీకాంత్ మరియు క్రీడ సంఘం సభ్యుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జాకిరి హుస్సేన్ కుబేర నాయుడు మండల యువజన నాయకుడు బందే నవాజ్ మార్కెట్ యార్డ్ వైస్ ప్రెసిడెంట్ మన్సూర్ సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి గోనెగండ్ల ఎస్సై తిమ్మారెడ్డి ఏఎస్ఐ తిమ్మారెడ్డి మాజీ కబడ్డీ ఆటగాళ్లు గ్రామ ప్రజలు పెద్దలు పాల్గొన్నారు.

- Advertisement -

70వ జాతీయ మహిళా కబడ్డీ పోటీలకు జట్టు ఎంపిక

మండల కేంద్రమైన గొనెగండ్లలో జరిగిన 70వ రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలలో పాల్గొన్న ఉమ్మడి 13 జిల్లాల జట్లనుండి 16 మంది కబడ్డీ క్రీడాకారిణులను శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం గుంటూరు కర్నూలు కృష్ణ చిత్తూరు జిల్లాల జట్ల నుండి ఈనెల పదవ తేదీన పంజాబ్లో జరిగే 70వ జాతీయ మహిళ కబడ్డీ పోటీలకు ఎన్నుకున్నారు జాతీయ జట్టుకు ఎంపికైన వారిలో కర్నూలు జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారిణులు రేవతి కవితలు ఎంపిక కావడంతో గోనెగండ్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News