Monday, June 23, 2025
HomeTS జిల్లా వార్తలుACB Cought by 100 Govt Officials: 6 నెలలు, 100 మంది ప్రభుత్వ అవినీతి...

ACB Cought by 100 Govt Officials: 6 నెలలు, 100 మంది ప్రభుత్వ అవినీతి ఉద్యోగులు

Currupted Employees: ప్రభుత్వ కొలువు సాధించి, ప్రజలకు సేవ చేయాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. తీరా ఉద్యోగం వచ్చాక సర్కారీ జీతంతో సంతృప్తి చెందక అనేక మంది ఉద్యోగులు అవినీతికి పాల్పడుతూ కోట్లకు పడగలు ఎత్తుతున్నారు. జవాబుదారీతనం, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ హోదాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేయాల్సిన వీరు లంచం పేరుతో సమాన్యులను వేధిస్తున్నారు. ముడుపులు ముట్టజెప్పందే పనులు కావు, చేయము అనే రీతిలో ప్రవర్తిస్తూ ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ)కి అడ్డంగా దొరుకుతున్నారు. తెలంగాణలో ఏసీబీ(యాంటి కరెప్షన్ బ్యూరో) దూకుడు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులు కొందరు అవితీనికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు దొరికిపోతున్నారు. గత ఆరు నెలల్లో 122 కేసులను ఏసీబీ ట్రాప్ చేసింది. 2025 సంవత్సరంలో 6 నెలల్లోనే 129 ట్రాప్ కేసులు నమోదు అయ్యాయి. 2024 సంవత్సరంలో 129 కేసులను ఏసీబీ నమోదు చేసింది. ఈఏడాది ఆరు నెలల కాలంలోనే 122 కేసులను ట్రాప్ చేసిన ఏసీబీ 100 మందికి పైగా ప్రభుత్వ అధికారులను కటకటాల్లోకి నెట్టింది. ఈ ఆరు నెలల కాలంలోనే అరెస్టయిన 100 మంది గవర్నమెంట్ ఎంప్లాయ్స్ లంచం తీసుకుంటూ దొరికిపోయినవారే.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/today-rain-updates-in-telangana-state/
ఈనెల 16న ములుగు డీ‌ఈ‌ఓ గొర్ల పాణిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిదే. అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్న ఓ ఉపాధ్యాయుడు తిరిగి విధుల్లో చేరెందుకు లంచం ఇవ్వాలని డీఈఓ డిమాండ్ చేశాడు. రూ. 20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ వలకు చిక్కాడు. డీ‌ఈవో కార్యాలయంలో ఎష్టాబ్లిష్మెంట్ విభాగం జూనియర్ అసిస్టెంట్ తొట్టే దిలీప్ కుమార్ యాదవ్‌లను ఇద్దరినీ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.



మహబూబాబాద్‌లోని హస్తినాపురం కాలనీలో ఈనెల 18న టీజీఎన్పిడీసీఎల్ మహబూబాబాద్ సర్కిల్, ఆపరేషన్స్ సూపరింటెండెంట్(ఎస్ఈ) ఇంజినీరు జనగాం నరేష్ ఓ వ్యక్తి నుంచి రూ. 20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు. కురవి, మరిపెడ సబ్-డివిజన్లకు సంబంధించిన ప్రస్తుతం ఉన్న ఒప్పందాలను అలాగే కొనసాగించేందుకు ఫిర్యాదుదారుని నుంచి సదరు ఎస్‌ఈ రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. అందులో ఇప్పటికే రూ.20వేలు తీసుకొని, మిగతా రూ.80వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుకన్నారు.

ALSO READ: https://teluguprabha.net/international-news/petrol-price-hike-soon-due-to-iran-and-us-conflict/
సూర్యాపేట జిలాల్లో సైతం కొద్దిరోజుల క్రితం డీఎస్పీ ఓ కేసుకు సంబంధించి లంచం తీసుకుంటుండగా ఏసీబీ ట్రాప్ చేసింది. అయితే, ప్రతి శాఖలోనూ అవినీతి అధికారులు కోకొల్లలుగా పెరిగిపోతున్నారు. అమాయక ప్రజల అవసరాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ, లంచం పేరుతో వేధిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News