Sunday, November 16, 2025
HomeTS జిల్లా వార్తలుCommunist Leader: తెలంగాణలో కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు మృతి

Communist Leader: తెలంగాణలో కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు మృతి

Communist Leader| ఖమ్మం జిల్లా సీపీఐ కార్యదర్శి పోటు ప్రసాద్(60) కన్నుమూశారు. బుధవారం ఉదయం మినీ ట్యాంక్ బండ్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

- Advertisement -

ప్రసాద్ మరణం పట్ల కమ్యూనిస్టు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ కాలం కమ్యూనిస్టు నాయకుడిగా ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రసాద్ మరణంపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad