Monday, November 17, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్పహల్గామ్ ఉగ్రదాడిపై హైదరాబాద్‌లో కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ..!

పహల్గామ్ ఉగ్రదాడిపై హైదరాబాద్‌లో కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ..!

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద హిందూ పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలో తెలంగాణలోనూ శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. హైదరాబాద్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్‌బండ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లూ భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ నేతలతో పాటు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. దాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పించారు.

- Advertisement -

ఘటనపై కేంద్రం తీసుకోవాల్సిన చర్యల్లో మద్దతు ఇస్తామని, ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో ప్రతీ ఒక్కరూ కలిసి నడవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పహల్గామ్ ఘటన బాధాకరమని, అలాంటి దాడులు మానవతను ఛేదిస్తున్నాయని నేతలు తెలిపారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనల్లో భాగంగా ఢిల్లీలో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల్లో శాంతియుత ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనల ద్వారా ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న నేతలు రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad