Monday, June 23, 2025
HomeTS జిల్లా వార్తలుPhone Tapping Case: అన్ని లెక్కలు తేలాల్సిందే: ఎంపీ డీకే అరుణ

Phone Tapping Case: అన్ని లెక్కలు తేలాల్సిందే: ఎంపీ డీకే అరుణ

MP DK Aruna Comments: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎంపీ డీకే అరుణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మేము మొదటి నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నామని ఎంపీ పేర్కొన్నారు. సోమవారం ఆమె రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కమ్మదనంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ అనేది ముమ్మాటికీ వ్యక్తి స్వేచ్ఛను హరించడమే అవుతందన్నారు. దోషులు ఎవరో.. దొంగలెవరో.. లెక్కలు తేలాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసును విచారించాలని డీకే అరుణ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఎంపీ డిమాండ్ చేశారు. పొలిటికల్ లీడర్లవే కాకుండా పార్టీ కింది స్థాయి కార్యకర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. తొలుత ఆమె జాతీయవాది, జన్ సంఘ్ వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నివాళి అర్పించారు. అనతంరం ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. చక్కగా చదవుకొని ఉన్నతస్థానాలకు చేరుకోవాలని, సెల్ ఫోన్‌కు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.

ప్రత్యర్థి పార్టీలు లేకుండా చేయాలనే గత ప్రభుత్వం.. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతల ఫోన్లను ట్యాప్ చేసిందని ఇటీవల పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించిన సంగతి తెలిసిందే. రాజకీయ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సుమారు 650 మంది నేతల ఫోన్లు ట్యాప్ అయినట్లు ఆయన వెల్లడించారు. కేసీఆర్ కనుసన్నుల్లోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని ఆరోపించారు.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/telangana-cabinet-meeting-today-discussion-about-local-body-elections/

కాగా, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక మందిని సిట్ విచారిస్తోంది. విచారణకు తాను కూడా హాజరు అవుతానని, తన ఫోన్‌ కూడా ట్యాప్ అయ్యిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఇటీవల మీడియాకు వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్బంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని, మూడవ సారి అధికారంలోకి రావడానికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిపారని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు పేర్కొన్నారు. 2015 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందని చెప్పారు. రాజకీయ నేతలు, బిజినెస్ మెన్స్.. సినిమా వాళ్ల ఫోన్లు సైతం ట్యాపింగ్ అయినట్లు సిట్ విచారణ అనంతరం ప్రకాశ్ రావు తెలిపారు.

ALSO READ:https://teluguprabha.net/business/indian-money-in-swiss-banks-rs-37600-crore-deposited/

కాగా, సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫోన్ ట్యాపింగ్ రివ్యూ కమిటీలో కీలక సభ్యులుగా ఉన్న అప్పటి హోం ప్రిన్సిపల్ సెక్రెటరీ జితేందర్, ఇంటిలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్‎ను ఈనెల 18న సిట్ బృందం ప్రశ్నించింది. ఫోన్‌ ట్యాపింగ్‌ ముమ్మాటికీ నిజమని, తెలుగు రాష్ట్రాలకు చెందిన మాజీ ముఖ్యమంత్రులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వైజా‌గ్‌ పర్యటనలో ఆరోపించించిన సంగతి విధితమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News