Tuesday, October 1, 2024
HomeతెలంగాణAchchampet: విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం తీసుకున్న గువ్వల బాలరాజు

Achchampet: విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం తీసుకున్న గువ్వల బాలరాజు

పూల వర్షంతో ఎమ్మెల్యేకి ఘన స్వాగతం

అచ్చంపేట పట్టణంలోని 1,2,3,12,13,14,15 వ వార్డులలో ప్రతిష్టించిన వినాయకుల మండపాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సందర్శించి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం తీసుకొని అచ్చంపేట నియోజకవర్గ ప్రాంతం ప్రజలు, రాష్ట్ర ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో గణనాథుని ప్రతిష్టాపించి నిష్ఠతో పూజలు చేయడం, గణపతి ఉత్సవాల వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. వివిధ వార్డులలో వినాయక మండపాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు , ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఏ వార్డులకు వెళ్లిన ఆయా వార్డుల నాయకులు, మహిళలు , యువత ,చిన్నారులు పూల వర్షం కురిపిస్తూ ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు.


వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన మండపాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్, మద్దిమడుగు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ విష్ణుమూర్తి, కౌన్సిలర్లు సుంకరి నిర్మల బాలరాజ్, మను పటేల్, అంతటి శివకృష్ణ, రమేష్ రావు , సోమ్లా నాయక్ , బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పులిజాల రమేష్ , స్థానిక నాయకులు , తీగల శ్రీనివాసులు , ఖాజా, పి శేఖర్, శంకర్ మాదిగ , కిరాణా వర్తక సంఘం సభ్యులు ఇట్టే శేఖర్ , ఇట్టే కిరణ్ ,నవీన్ ,లక్ష్మీకాంత్, శ్రీకాంత్, చంద్రశేఖర్, కిషోర్ ,సురేష్ , ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ఆయా కాలనీ వాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News