ప్రపంచ పర్యావరణ దినోవత్సవాన్ని(World Environment Day)పురస్కరించుకుని అదానీ(Adani) సిమెంట్( పెన్నా సిమెంట్) గణేష్ పహాడ్ యూనిట్ లో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులంతా కలిసి దాదాపు 500 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా యూనిట్ ప్లాంట్ చీఫ్ ప్లాంట్ మేనేజర్ కె. సుబ్బులక్ష్మణన్ మాట్లాడుతూ.. ఈ సీజన్ లో తమ ప్లాంట్ ఆవరణలో 1000 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్లాంట్ గేట్ నుంచి ప్లాంటేషన్ వేదిక వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పర్యావరణ సంచాలకులు పి.గోలపాకృష్ణ పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వి.వి.రావు, సునీల్, శ్రీరాములు, ఇతర ఉద్యోగలు పాల్గొన్నారు.

