Monday, November 17, 2025
HomeతెలంగాణRudravaram: కొనసాగుతున్న అహోబిలం పారవేట ఉత్సవాలు

Rudravaram: కొనసాగుతున్న అహోబిలం పారవేట ఉత్సవాలు

ఉత్సవ మూర్తులకు భక్తి శ్రద్ధలతో పూజలు

అహోబిల శ్రీ లక్ష్మీనరసింహస్వామి పారవేట ఉత్సవాలు మండల కేంద్రమైన రుద్రవరంలో కొనసాగుతున్నాయి. పారవేట ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం గ్రామంలోని పలు తెలుపులపై కొలువుదీరిన ఉత్సవ మూర్తులను గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అర్చకులు మధు, సతీష్ భక్తులు అందించిన పూజా సామాగ్రిని స్వామి వారికి సమర్పించి శఠగోపంతో భక్తులను ఆశీర్వదించారు. పారవేట ఉత్సవాల సందర్భంగా గ్రామంలో తిరుణాల వాతావరణం నెలకొంది. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad