Saturday, May 18, 2024
HomeతెలంగాణAmanagal: బీఆర్ఎస్‌కు బిగ్‌షాక్

Amanagal: బీఆర్ఎస్‌కు బిగ్‌షాక్

మల్లు రవిని గెలిపించాలని..

రంగారెడ్ది జిల్లా ఆమనగల్ మండల బిఆర్ఎస్‌ పార్టీకి ఆ పార్టీ నేతలు బిగ్‌షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో అమనగల్లు మండల వైస్ ఎంపీపీ జక్కుఅనంత రెడ్డి, ఎంపీటీసీ నిట్ట మంగమ్మ నారాయణలు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవిలు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వారితో పాటు 150 మందికి పైగా కార్యకర్తలు బీఆర్ఎస్ కి రాజీనామా చేసి, ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆకర్షతులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వైస్ ఎంపీపీ అనంత రెడ్డి, ఎంపీటీసీ నిట్ట నారాయణలు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యకర్తలు, అభిమానులు అందరూ సమిష్టిగా పనిచేయాలని ఆయన సూచించారు. గ్రామ గ్రామాన కార్యకర్తలందరూ ప్రజలను ఉత్తేజపరుస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేలా నాగర్‌కర్నూల్ నుండి మల్లు రవిని అత్యధిక మెజారిటీతో పార్లమెంటుకు పంపాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్, పిసిసి సభ్యులు ఆయిల్ శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ నాయకులు వెంకటేశ్వర్లు, హనుమాన్ నాయక్, వస్పుల జంగయ్య, గుర్రం కేశవులు, తాళ్ల రవీందర్, విజయ్ రాథోడ్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News