Thursday, June 26, 2025
HomeతెలంగాణShyamala: యాంకర్ శ్యామలకు హైకోర్టులో భారీ ఊరట

Shyamala: యాంకర్ శ్యామలకు హైకోర్టులో భారీ ఊరట

బెట్టింగ్ యాప్స్(Betting Apps) ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల(Shyamala)కు తెలంగాణ హైకోర్టులో భారీ లభించింది. ఈ కేసులో శ్యామలను అరెస్ట్ చేయవద్దంటూ పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని శ్యామలకు సూచించింది. సోమవారం నుంచి పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఆమెకు నోటీసులు ఇచ్చి పోలీసులు విచారణ కొనసాగించవచ్చని తెలిపింది.

- Advertisement -

కాగా బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ శ్యామల హైకోర్టు(TG High Court)ను ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్స్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన టాలీవుడ్ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో కలిపి మొత్తం 25 మందిపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News