Wednesday, October 2, 2024
HomeతెలంగాణAnjayya Yadav: సీఎంఆర్ఎఫ్ పేదల పాలిటవరం

Anjayya Yadav: సీఎంఆర్ఎఫ్ పేదల పాలిటవరం

పేదలకు ఆపన్న హస్తం

షాద్ నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండలంలోని వివిధ గ్రామాల వారికీ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు లబ్ది చేకూరుతుందని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీ.ఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలలో దేశంలోనే నెంబర్ వన్ అని ఈ కుటుంబంలో ఏదో విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. వచ్చే ఎలక్షన్లలో బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మూడోసారి కెసిఆర్ ముఖ్యమంత్రిగా చేసుకుంటే మళ్లీ ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని, ప్రతిపక్షాల కల్లబొల్లి హామీలకు మోసపోవద్దని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.

- Advertisement -

మంత్రి సహాయనిధి లబ్ధి పొందిన వారు. 1) పోమాల్ పల్లి గ్రామం,నిధురం పుష్పమ్మ రూ. 2,00,000/-,2) బొదునంపల్లి గ్రామం ఎ. రాములమ్మ 16,000/-,3) లింగంధన గ్రామం రూ.,ఎన్. పురుషోత్తం 1,00,000/- 4) కాకునుర్ సి. లింగం రూ. 36,000/- 5) చౌలపల్లి గ్రామం,రూ. బి. సత్తయ్య, సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 52,000/-,కార్యక్రమంలో పాల్గొన్నవారు, షాద్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వర్గాల లక్ష్మీనారాయణ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జమాల్ ఖాన్, కానుగుల భాస్కర్, నాగిళ్ళ కృష్ణ, టిఆర్ఎస్ పార్టీ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News