Friday, September 20, 2024
HomeతెలంగాణAnjayya Yadav: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం

Anjayya Yadav: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం

రాష్ట్రంలో ప్రతి గ్రామం ఆదర్శంగా మారుతోంది

దేశంలో మరేరాష్ట్రం అమలుచేయని ఎన్నో కార్యక్రమాలకు నాంది పలకడం ద్వారా అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందని షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మండల పరిధిలోని కుందేల్ కుంట తండాలో 20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. చింతగూడ గ్రామంలో 15 లక్షలతో ఎస్సీ కమిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు 69 యూనిట్ల గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాడు వెలవెల బోయిన గ్రామాలు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయన్నారు.

- Advertisement -


తెలంగాణ సర్కార్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో ప్రతి గ్రామం ఆదర్శంగా మారుతోందని ఆయన అన్నారు.అదే విధంగా గొల్ల కురుమల ఆర్థిక ఎదుగుదలకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

బిఆర్ఎస్ లో చేరికలు..
షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం గంట్లవెల్లి, నేరళ్లచెరువు గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, ఎంపీపీ ఖజా ఇద్రీస్, ఆయా గ్రామాల సర్పంచ్ లు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News