Monday, July 8, 2024
HomeతెలంగాణBasheerabad: గులాబీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనంలో జోష్

Basheerabad: గులాబీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనంలో జోష్

బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ గ్రామంలో ఆత్మీయ సమ్మేళనం హఠాత్తుగా నిర్వహించుకోవడంతో గులాబీ శ్రేణులు ఉత్సాహం పెరిగింది. గత నెల రోజుల నుండి తాండూరు నియోజకవర్గంలో పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ కుటుంబం ఈ ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాసింపూర్ గడ్డ మీద ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ గత పాలనలో చేసే అభివృద్ధి ఏమి లేదని అన్నారు. 20 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏం లేదని అన్నారు. తాండూర్ అభివృద్ధి నా లక్ష్యం అంటూ ఒక సంవత్సరంలో రూపురేఖలు మార్చాను, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బిజెపిని భూస్థాపితం చేసి, టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని సూచించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజు గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాము నాయక్, రాష్ట్ర సీనియర్ నాయకులు కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి , రాష్ట్ర నాయకుడు శ్రీశైల్ రెడ్డి, నర్సిరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షురాలు జయమ్మ, మండల వైస్ ఎంపీపీ అన్నపూర్ణ , అనంతయ్య గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవీందర్ సింగ్ , కౌన్సిలర్ విజయ దేవి, కో ఆప్షన్ మెంబెర్ అబ్దుల్ రజాక్, ఎస్సీ సెల్ అధ్యక్షులు నరేష్ , యూత్ ప్రెసిడెంట్ తహెర్ బాండ్, వైస్ ప్రెసిడెంట్ వినోద్, కోపరేటివ్ డైరెక్టర్స్ జీ నర్సిరెడ్డి, అశోక్ గౌతమ్, నవీన్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, ఎంపిటిసిలు వడ్డే శ్రీనివాస్, లక్ష్మీబాయి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు గోపాల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రాజన్న, జగ్గు దాదా, రాజు, దస్తాయి గౌడ్, వీరారెడ్డి, మునీందర్ రెడ్డి, సర్పంచులు వీరారెడ్డి, ఎం నర్సిరెడ్డి, శివ, గ్రామ కమిటీ అధ్యక్షులు యూత్ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News