Tuesday, September 17, 2024
HomeతెలంగాణBest Mandal: 'నేషనల్ బెస్ట్ మండల్' అవార్డు అందుకున్న తిమ్మాపూర్ ఎంపీపీ

Best Mandal: ‘నేషనల్ బెస్ట్ మండల్’ అవార్డు అందుకున్న తిమ్మాపూర్ ఎంపీపీ

కేంద్ర ప్రభుత్వం నేషనల్ పంచాయతీ అవార్డులలో భాగంగా విజ్ఞాన్ భవన్ న్యూ ఢిల్లీలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కిషోర్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా నేషనల్ బెస్ట్ మండల్ అవార్డును కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎంపీపీ కేతిరెడ్డి రెడ్డి వనిత-దేవందర్ రెడ్డి, అడిష నల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) గరిమ అగర్వాల్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, ఎంపీడీఓ రవీందర్ రెడ్డి లతో కలిసి అందుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా తిమ్మాపూర్ ఎంపీపీ కేతిరెడ్డి రెడ్డి వనిత- దేవందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ అవార్డు సాధనకు కృషి చేసిన శాసన సభ్యులు రసమయి బాలకిషన్, కలెక్టర్ కర్ణన్, జడ్పీ సీఈఓ ప్రియాంక, డీఆర్డీవో, డీఎల్పీవో జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీ కి, సర్పంచులు, ఎంపీటీసీ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు ఎంపీపీ కేతిరెడ్డి వనిత దేవందర్ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News