Friday, September 20, 2024
HomeతెలంగాణBhimadevarapalli: భీమదేవదేవరపల్లి మండల నూతన తహసిల్దార్ గా ప్రవీణ్ కుమార్

Bhimadevarapalli: భీమదేవదేవరపల్లి మండల నూతన తహసిల్దార్ గా ప్రవీణ్ కుమార్

ప్రజల సమస్యలు, అవసరాల,కు అనుగుణంగా పనిచేస్తా

భీమదేవరపల్లి మండల నూతన తహసిల్దారుగా రోకుల ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. హన్మకొండ కలెక్టరేట్ లో చీఫ్ సూపరిండెంట్ గా విధులు నిర్వహించి బదిలీపై భీమదేవరపల్లి మండల తహసిల్దార్ గా వచ్చారు. భీమదేవరపల్లి మండలములో తహసిల్దార్ గా విధులు నిర్వహించిన వెంకట భాస్కర్ పరకాలకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందించేందుకు ముందుంటానని అన్నారు. ప్రజల సమస్యలు అవసరాలు అనుగుణంగా పనిచేస్తానన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News