Sunday, October 6, 2024
HomeతెలంగాణBJP: డబుల్ ఇంజన్ సర్కార్ తో తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు

BJP: డబుల్ ఇంజన్ సర్కార్ తో తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు

'ఎమ్మెల్యే ప్రవాస్ యోజన' కార్యక్రమంలో భాగంగా హుజూరాబాద్ వచ్చిన..

అనేక సాసోపేత నిర్ణయాలను అమలు చేసిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని BJP అస్సాం రాష్ట్ర ఎమ్మెల్యే ధర్మేశ్వర్ కొన్వర్ అన్నారు. ‘ఎమ్మెల్యే ప్రవాస్ యోజన’ కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన అస్సాం ఎమ్మెల్యే స్థానిక బిజెపి శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని వమ్ము చేయకుండా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్లుగా అవినీతి రహిత పాలన కొనసాగించిందన్నారు. ఇన్నేళ్లుగా బిజెపి ప్రభుత్వం ప్రజల విశ్వాసం చూరగొన్నదని , ప్రధాని మోదీ నాయకత్వానికి, సుపరిపాలనకు ప్రజలంతా సంపూర్ణ మద్దతు తెలియజేయడం సంతోషకరమన్నారు. బిజెపి మోడీ ప్రభుత్వం దేశ కోసమే అనుక్షణం ఆలోచన చేస్తుందన్నారు. బిజెపి మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలునేడు దేశ దిశ దశలను మార్చాయని, దేశాభివృద్ధి కోసం అన్ని విషయాల్లో ప్రపంచం తోని పోటీ పడుతుందని, ఆ పాలన విధానాతో దేశ ఖ్యాతి విశ్వంలో మార్మోగుతుందన్నారు. మోదీ ప్రభుత్వ పాలన తీరును ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని, దీంతో దేశం కీర్తి విశ్వంలో మారుమోగుతుందన్నరు.
ఈ సమావేశంలో బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, బిజెపి పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, ప్రవాస్ యోజన కోఆర్డినేటర్ పుప్పల రఘు, బిజెపి అధికార ప్రతినిధులు జెల్ల సుధాకర్, మాసాడి ముత్యంరావు, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు కళ్లెపు రేణుక, స్వల్పకాలిక్ విస్తారక్ సుధీర్, సీనియర్ నాయకులు కళ్లేపు సుధాకర్ రావు, జిల్లా పదాధికారులు, వివిధ మోర్చా అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జిలు, బూత్ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News