Thursday, September 19, 2024
HomeతెలంగాణChegunta: సతీష్ గౌడ్ విగ్రహావిష్కరణలో రఘునందన్ రావు

Chegunta: సతీష్ గౌడ్ విగ్రహావిష్కరణలో రఘునందన్ రావు

దివంగత బీజేపీ నేత విగ్రహావిష్కరణ

చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ దివంగత యువ నాయకుడు సతీష్ గౌడ్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు దుబ్బాక మాజీ శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు. రఘునందన్ రావు మాట్లాడుతూ ఒక మంచి మిత్రుని కోల్పోయానని నాకు చాలా బాధగా ఉందని, పార్టీకి తీరని నష్టమని వాటిల్లిందన్నారు. నాకు లోకసభ టికెట్ ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, నడ్డాకి, అమిత్ షాకి, కిషన్ రెడ్డికి నాపై నమ్మకం ఉంచి మెదక్ లోకసభ టికెట్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో చేగుంట మండల బిజెపి అధ్యక్షులు చింతాల భూపాల్ చేగుంట మండల వైస్ ప్రెసిడెంట్ రామచంద్రం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News