Friday, September 20, 2024
HomeతెలంగాణCheryala: రైతులతో సమావేశమైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

Cheryala: రైతులతో సమావేశమైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

అద్భుతమైన సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం

దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా అద్భుతమైన సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. చేర్యాల మండలంలోని ముస్త్యాల రైతు వేదికలో ముస్త్యాల, వీరన్నపేట, చుంచన్నకోట గ్రామాల రైతుల తో ముస్త్యాల గ్రామ సర్పంచ్ పెడతల ఎల్లారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తా మనడం హాస్యాస్పదమని, తమ ప్రభుత్వం రైతుల మేలుకొరి 24 గంటల ఉచిత విద్యుత్ తీస్తుంటే కాంగ్రెస్ పార్టీ మూడు గంటలు ఇస్తామని అనడం రైతులకు ద్రోహం చేయడమేనని, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలోనే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే, తెలంగాణలో మీరెందుకు 24 గంటలు ఇస్తున్నారని ఇక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని, దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా అద్భుతమైన సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఒక్క సీటు కూడా రాదని వారు కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఆపేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశం,ఎంపీపీ కరుణాకర్,బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతల మల్లేశం, వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి నాలుగు మండలాల గీత అధ్యక్షుడు శివగారి అంజయ్య, కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్లు కొంగర గిరిధర్,సూటిపల్లి బుచ్చిరెడ్డి, టిఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు మీస పార్వతి,పట్టణ అధ్యక్షురాలు తాళం రంజిత,గ్రామ ఉపసర్పంచ్ మీస రవితేజ, వీరన్నపేట గ్రామ సర్పంచ్ బిక్షపతి, ఎంపిటిసి ఎలికట్ట శివశంకర్,బిఆర్ఎస్ నాయకులు వల్లూరు శ్రీనివాస్, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సాతెల్లి జగన్, అరిగ కనకయ్య,పోకల శ్రీకాంత్ రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News