Sunday, July 7, 2024
HomeతెలంగాణChityala: గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గుళ్లో ప్రత్యేక కార్యక్రమాలు

Chityala: గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గుళ్లో ప్రత్యేక కార్యక్రమాలు

చిట్యాల గాంధీ గుళ్లో గాంధి జయంతి

మహాత్మా గాంధీ గారి 154వ జయంతి సందర్భంగా నేడు చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో గాంధీ టెంపుల్ లో జరిగిన జయంతి వేడుకలకు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీ టెంపుల్ లో ఆయన గాంధీజీ విగ్రహానికి నివాళులు అర్పించి, ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గాంధీ ట్రస్ట్ తరుపున జోగినిపల్లి శ్రీనివాస్ రావు, పొన్నపాటి ఈశ్వర్ రెడ్డి, వజ్రాల రామలింగచారీకు జీవన సాఫల్య పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ టెంపుల్ నిర్వాహకులు, మాజీ ఐ ఆర్ యస్ భూపాల్ రెడ్డి, ఆయన సతీమణి సీతా, మేనేజింగ్ ట్రస్టీ శ్రీపాల్ రెడ్డి, వి. కృష్ణా రెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు, చిట్యాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News