మహాత్మా గాంధీ గారి 154వ జయంతి సందర్భంగా నేడు చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో గాంధీ టెంపుల్ లో జరిగిన జయంతి వేడుకలకు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీ టెంపుల్ లో ఆయన గాంధీజీ విగ్రహానికి నివాళులు అర్పించి, ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గాంధీ ట్రస్ట్ తరుపున జోగినిపల్లి శ్రీనివాస్ రావు, పొన్నపాటి ఈశ్వర్ రెడ్డి, వజ్రాల రామలింగచారీకు జీవన సాఫల్య పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ టెంపుల్ నిర్వాహకులు, మాజీ ఐ ఆర్ యస్ భూపాల్ రెడ్డి, ఆయన సతీమణి సీతా, మేనేజింగ్ ట్రస్టీ శ్రీపాల్ రెడ్డి, వి. కృష్ణా రెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు, చిట్యాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/10/03a5e095-8c7b-45fb-9827-e500d8f02909-1024x768.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/10/8b0cb1e8-fb0f-4d7e-8706-515c5cc98f98-1024x576.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/10/5701e72b-3f46-4dfe-bc02-5762b949e02f-1024x576.jpg)