Monday, November 17, 2025
HomeతెలంగాణRevanth Reddy: జర్నలిస్టులకు త్వరలో గుడ్ న్యూస్

Revanth Reddy: జర్నలిస్టులకు త్వరలో గుడ్ న్యూస్

10 ఏళ్లు దగా పడ్డ మీడియా

శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతర పర్యటన సందర్భంగా అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు సమర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా దగా పడ్డ మీడియా సోదరులకు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందిస్తామని తెలిపారు. గతంలో జర్నలిస్టులు సచివాలయం బయట వరకే పరిమితమయ్యారని కానీ ఈ ప్రభుత్వంలో ప్రతి ఛాంబర్ లో తిరిగే అవకాశం కలిగించిందని పేర్కొన్నారు. త్వరలోనే ప్రెస్ అకాడమీ చైర్మన్ ను నియమించి, పలు సంఘాలతో బాధ్యుల అందరితో చర్చించి, వారి విన్నపాల మేరకు సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad